RTC Bus: 14 రోజులుగా వరదల్లో చిక్కుకుపోయిన ఆర్టీసీ బస్సు

ABN , First Publish Date - 2022-07-21T18:45:15+05:30 IST

మంచిర్యాల (Manchiryala): జిల్లాలో 14 రోజులుగా ఆర్టీసీ బస్సు (RTC Bus) వరదల్లో చిక్కుకుపోయింది.

RTC Bus: 14 రోజులుగా వరదల్లో చిక్కుకుపోయిన ఆర్టీసీ బస్సు

మంచిర్యాల (Manchiryala): జిల్లాలో 14 రోజులుగా  ఆర్టీసీ బస్సు (RTC Bus) వరదల్లో చిక్కుకుపోయింది. చుట్టూ వరద నీరు చేరడం, రహదారులు కూడా దెబ్బతినడంతో బస్సుతో సహా డ్రైవర్, కండక్టర్ రెండు వారాలుగా ఓ గ్రామంలో చిక్కుకున్నారు. చెన్నూరు (Chennoor) నుంచి కోటిపల్లి (Kotipalli) మండలం, వెంచపల్లి గ్రామానికి ఈ నెల 8న ప్రయాణీకులతో ఆర్టీసీ బస్సు వెళ్లింది. అయితే భారీ వర్షాల (Heavy Rains) కారణంగా వరదలు, వాగులు ఉధృతంగా ప్రవహించాయి. వరద తగ్గుముఖం పట్టాక వెళదామని భావించిన వారి అంచనా తప్పింది. వరద ప్రవాహం రోజు రోజుకు ఎక్కువైంది. ఆ గ్రామం నుంచి చెన్నూరు వెళ్లేందుకు రెండు దారులు ఉన్నాయి. సిర్షా, పారిపల్లి మీదుగా ఉన్న రహదారి పలుచోట్ల వరదలకు కొట్టుకుపోయింది. రాచల్ల, ముల్కలపేట మీదగా ఉన్న రహదారి ప్రాణహిత బ్లాక్ వాటర్‌లో మునిగిపోయింది. ఎటు చూసినా వరద నీరు ఉండడంతో బస్సు తిరిగి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బస్సు డ్రైవర్, కండక్టర్ బస్సుతో సహా గ్రామంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. తమ కోసం వచ్చి వరదలతో చిక్కుకుపోవడంతో గ్రామస్తులు వారిని అతిథుల్లా చూసుకుంటున్నారు. ప్రతి ఏటా తమకు ఇలాంటి ఇబ్బందులే ఉంటున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.

Updated Date - 2022-07-21T18:45:15+05:30 IST