కొత్తమాజేరుకు ఆర్టీసీ బస్సు సర్వీసు
ABN , First Publish Date - 2021-04-16T06:41:42+05:30 IST
చల్లపల్లి మండలంలోని కొత్తమాజేరు గ్రామానికి ఆర్టీసీ బస్ సర్వీసు ప్రారంభమైంది.
చల్లపల్లి, ఏప్రిల్ 15 : చల్లపల్లి మండలంలోని కొత్తమాజేరు గ్రామానికి ఆర్టీసీ బస్ సర్వీసు ప్రారంభమైంది. అవనిగడ్డ డిపోకు చెందిన బస్సు గురువారం ఉదయం కొత్తమాజేరు చేరుకుంది. అవనిగడ్డ డిపో మేనేజర్ బి.కోటేశ్వర నాయక్ మాట్లాడుతూ చల్లపల్లి - లక్ష్మీపురం మధ్య పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల సౌకర్యార్థం అవనిగడ్డ డిపో నడుపుతున్న బస్సు సర్వీసును పొడిగించినట్లు తెలిపారు. ఈ సర్వీసు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం చల్లపల్లి చేరుకుంటుందని వివరించారు. మచిలీపట్నం రూరల్ మండలం భోగిరెడ్డిపల్లి, కొత్తమాజేరు గ్రామా ల విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు వెంటనే స్పందించి ఈ సర్వీసును పొడి గించినట్లు డీఎం తెలిపారు. ఈ బస్సు సర్వీసును విద్యార్థులతోపాటు సాధారణ ప్రయాణికులు కూడా వినియోగించుకోవాలన్నారు. కాగా తొలిసారి తమ ఊరికి ఆర్టీసీ బస్ రావటంతో కొత్తమాజేరు, భోగిరెడ్డిపల్లి గ్రామాల ప్రజల హర్షం వ్యక్తం చేశారు.