ఆర్టీసీ బస్సు చార్జీలు వెంటనే తగ్గించాలి
ABN , First Publish Date - 2022-07-04T05:09:10+05:30 IST
ఆర్టీసీ బస్సు చార్జీలు వెంటనే తగ్గించాలని బ్రహ్మంగారిమఠం ఐదు రోడ్ల కూడలి వద్ద సీపీఎం నేతలు ధర్నా నిర్వహించారు.
బ్రహ్మంగారిమఠం, జూలై 3 : ఆర్టీసీ బస్సు చార్జీలు వెంటనే తగ్గించాలని బ్రహ్మంగారిమఠం ఐదు రోడ్ల కూడలి వద్ద సీపీఎం నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం సీనియర్ నాయకుడు బోలా శ్రీరాములు, మండల కార్యదర్శి వర్గ సభ్యుడు గండి సునీల్కుమార్ మాట్లాడుతూ ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు విపరీతంగా పెంచి పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు తెలిపారు. త్వరలోనే సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ బస్సు చార్జీలను తగ్గించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు రెబ్బ నరసింహులు, రాహుల్, రాజశేఖర్, ఆనంద్రావు, ఆంజనేయులు, సందీప్, రాహుల్, చక్రి, మునయ్య, చిన్నబ్బి తదితరులు పాల్గొన్నారు.