తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2022-01-14T05:11:13+05:30 IST

మడపాం టోల్‌గేట్‌ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం పెను ప్రమాదం తప్పింది. అనకాపల్లి నుంచి పలాస వస్తున్న ఆర్టీసీ బస్సు అదపు తప్పి డివైడర్‌ను ఢీకొంది.

తప్పిన ప్రమాదం
డివైడర్‌ను ఢీకొని అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు, ఘటనా స్థలంలో ప్రయాణికులు

- డివైడర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు  

- 55 మంది ప్రయాణికులు సురక్షితం

నరసన్నపేట, జనవరి 13 : మడపాం టోల్‌గేట్‌ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం పెను ప్రమాదం తప్పింది. అనకాపల్లి నుంచి పలాస వస్తున్న ఆర్టీసీ బస్సు అదపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ క్రమంలో బస్సు బోల్తా పడేలా ఊగిసలాడడంతో ప్రయాణికులంతా భయపడి కేకలు వేశారు.  ఈ సమయంలో బస్సులో 55 మంది ఉన్నారు. వీరిలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. టెక్కలికి చెందిన కృష్ణ.. కుడి కాలు విరిగిపోయింది. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను 108 వాహనం, నేషనల్‌ హైవే అబులెన్స్‌ల్లో ప్రథమ చికిత్స అందజేశారు.  స్టీరింగ్‌ పట్టేయడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-01-14T05:11:13+05:30 IST