తప్పిన ప్రమాదం
ABN , First Publish Date - 2022-01-14T05:11:13+05:30 IST
మడపాం టోల్గేట్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం పెను ప్రమాదం తప్పింది. అనకాపల్లి నుంచి పలాస వస్తున్న ఆర్టీసీ బస్సు అదపు తప్పి డివైడర్ను ఢీకొంది.
- డివైడర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
- 55 మంది ప్రయాణికులు సురక్షితం
నరసన్నపేట, జనవరి 13 : మడపాం టోల్గేట్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం పెను ప్రమాదం తప్పింది. అనకాపల్లి నుంచి పలాస వస్తున్న ఆర్టీసీ బస్సు అదపు తప్పి డివైడర్ను ఢీకొంది. ఈ క్రమంలో బస్సు బోల్తా పడేలా ఊగిసలాడడంతో ప్రయాణికులంతా భయపడి కేకలు వేశారు. ఈ సమయంలో బస్సులో 55 మంది ఉన్నారు. వీరిలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. టెక్కలికి చెందిన కృష్ణ.. కుడి కాలు విరిగిపోయింది. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను 108 వాహనం, నేషనల్ హైవే అబులెన్స్ల్లో ప్రథమ చికిత్స అందజేశారు. స్టీరింగ్ పట్టేయడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.