ఏపీ హైకోర్టులో ఆర్టీఐ కార్యకర్త దొరస్వామి పిటిషన్
ABN , First Publish Date - 2022-02-02T22:18:08+05:30 IST
ఏపీ హైకోర్టులో ఆర్టీఐ కార్యకర్త దొరస్వామి పిటిషన్ వేశారు. ఆర్టీఐ కింద
అమరావతి: ఏపీ హైకోర్టులో ఆర్టీఐ కార్యకర్త దొరస్వామి పిటిషన్ వేశారు. ఆర్టీఐ కింద సమాచారం అడిగితే చిత్తూరు డీఎంహెచ్ఓ తనపై రౌడీషీటర్లతో దౌర్జన్యం, బెదిరింపులకు గురిచేస్తున్నారని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. తనకు, తన కుటుంబసభ్యులకు చిత్తూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పిటిషనర్ తెలిపారు. తక్షణమే పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. విచారణను హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.