ఆర్ఎస్ఎస్‌ను బీజేపీలో విలీనం చేయాలి: సీఎం గెహ్లోత్

ABN , First Publish Date - 2022-04-16T03:21:23+05:30 IST

ఆర్ఎస్ఎస్‌ను బీజేపీలో విలీనం చేయాలి: సీఎం గెహ్లోత్

ఆర్ఎస్ఎస్‌ను బీజేపీలో విలీనం చేయాలి: సీఎం గెహ్లోత్

జైపూర్: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ను భారతీయ జనతా పార్టీలో విలీనం చేసి రాజకీయ పార్టీగా మార్చాలని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ సలహా ఇచ్చారు. 10-15 ఏళ్లలో అఖండ భారత్ సాధ్యమవుతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు. బీజేపీ గెలుపు కోసం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వెనకాల ఉండి మద్దతు ఇస్తూ ఉంటారని కానీ ఇప్పుడు వారికి ఆ అవసరం లేదని, బీజేపీతో కలిసి పోయి రాజకీయ పార్టీగా మారొచ్చని గెహ్లోత్ అన్నారు.


శుక్రవారం రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘దేశంలో ఇప్పటికీ అంటరానితనం ఆధారంగా కేసులు నమోదు అవుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. మనకు నిజంగా అఖండ భారత్ కావాలని ఉంటే అన్ని కులాలను, మతాలను ఒకతాటిపైకి తీసుకురావాలి. అంటరానితనానికి అణచివేతకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ ప్రచారం చేయాలి. ప్రధానమంత్రి కూడా దేశాన్ని ఉద్దేశించి దీనిపై మాట్లాడాలి. ఆహారం, మతం, కులం, బట్టలు ఆధారంగా ఎవరిపై వివక్ష చూపకుండా ఉండాలి’’ అని అన్నారు.

Updated Date - 2022-04-16T03:21:23+05:30 IST