‘కుల, చేతి వృత్తుల కుటుంబాలకు రూ. 20 వేల ప్యాకేజీ ప్రకటించాలి’
ABN , First Publish Date - 2020-07-08T09:26:09+05:30 IST
కుల, చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న ప్రతి బీసీ కుటుంబానికి రూ. 20 వేల ఆర్థిక ప్యాకేజీ ..
రాంనగర్, జూలై 7(ఆంధ్రజ్యోతి): కుల, చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న ప్రతి బీసీ కుటుంబానికి రూ. 20 వేల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ కార్పొరేషన్లో పెండింగ్లో ఉన్న 5 లక్షల 77వేల మందికి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం విద్యానగర్లోని బీసీ భవన్లో దీక్షలు నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, టీజేఎస్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ కోదండరాం దీక్షలకు సంఘీభావం తెలిపారు.