గ్రామ పంచాయతీలకు రూ.101 కోటు
ABN , First Publish Date - 2020-03-29T11:08:19+05:30 IST
జిల్లాలోని 1069 గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.101 కోట్ల 24 లక్షల 72 వేల కోట్లు
ఆర్థిక సంఘం నిధుల విడుదల
1069 గ్రామాలలో నిధుల గలగల
మంచినీటి పథకాలకు కేటాయింప్లు
(ఆంధ్రజ్యోతి- రాజమహేంద్రవరం): జిల్లాలోని 1069 గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.101 కోట్ల 24 లక్షల 72 వేల కోట్లు విడుదలయ్యాయి. ఇవి 2018-19 ఆర్థిక సంవత్పరానికి చెందిన రెండో విడత నిధులు. పంచాయతీ ఎన్నికలు జరగకపోయినా కేంద్రం ఈ నిధులను విడుదల చేసింది. చాలాకాలం తర్వాత గ్రామాల్లో ఢిల్లీ కాసులు గలగలలాడుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆయా గ్రామ జనాభా, మంచినీటి ఫథకాల నిర్వహణను పరిగణనలోకి తీసుకుని ఆయా గ్రామాలకు నిధులు విడుదల చేసింది.
ఈ గ్రాంటు నుంచి సీపీడబ్ల్యుఎస్ స్కీమ్ రూ.10 కోట్ల 09 లక్షల 11 వేల 630 కేటాయించారు. పంచాయతీలో ఒక్కో చేతి పంపు నిర్వహణకు రూ.1000 వంతున 8,974 చేతిపంపులకు రూ.89,74,000 కేటాయించారు. ఈ నిధులతో మంచినీటి నిర్వహణ, శానిటేషన్, రోడ్ల నిర్మాణం చేపట్టవచ్చు. ఇప్పటికే ఆయా గ్రామ పంచాయతీల అక్కౌంట్లలో నిధులు జమయ్యాయి.