రూ. పది లక్షల విలువైన గుట్కా స్వాధీనం

ABN , First Publish Date - 2021-12-05T04:35:02+05:30 IST

మండలంలోని బూచినెల్లి గ్రామ చౌరస్తా వద్ద 65వ జాతీయ రహదారిపై శనివారం నిషేధిత గుట్కాను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

రూ. పది లక్షల విలువైన గుట్కా స్వాధీనం
పోలీసుల అదుపులో నిందితులు

 జహీరాబాద్‌, డిసెంబరు 4: మండలంలోని బూచినెల్లి గ్రామ చౌరస్తా వద్ద 65వ జాతీయ రహదారిపై శనివారం నిషేధిత గుట్కాను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వాహనాల తనిఖీలో భాగంగా చిరాగ్‌పల్లి పోలీసులు బీదర్‌ నుంచి హైదరాబాద్‌లోని చందానగర్‌కు  బోలె రో వాహనంలో అక్రమంగా రవా ణా చేస్తున్న గుట్కాను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.  చందానగర్‌కు చెందిన సతీష్‌, సదాశివపేటకు చెందిన వీరేశం, మునిపల్లి మండలం పెద్దగోప్లరం వాసి రాచన్న బోలెరో వాహనంలో రూ. 10 లక్షల విలువ చేసే గుట్కాను తరలిస్తుండగా పట్టుకుని,  కేసు నమోదు చేసినట్టు జహీరాబాద్‌ డీఎస్పీ శంకర్‌రాజ్‌ తెలిపారు.

Updated Date - 2021-12-05T04:35:02+05:30 IST