బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ABN , First Publish Date - 2022-04-05T01:43:52+05:30 IST
నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీని సోమవారం బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్, రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు.
బాసర: నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీని సోమవారం బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్, రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. యూనివర్సిటీలో పర్యటించి విద్యార్థులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సౌకర్యాలతో పాటు విద్యాబోధన గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు వర్సిటీలో నెలకొన్న సమస్యలను ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.