గడీల పాలన అంతమొందిస్తా: ఆర్ఎస్ ప్రవీణ్
ABN , First Publish Date - 2022-03-22T01:40:27+05:30 IST
రాష్ట్రంలో ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న సీఎం కేసీఆర్ గడీల పాలనను అంతమొందిస్తానని బహుజన సమాజ్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ హెచ్చరించారు.
సూర్యాపేట: రాష్ట్రంలో ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న సీఎం కేసీఆర్ గడీల పాలనను అంతమొందిస్తానని బహుజన సమాజ్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ హెచ్చరించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని కొమ్మాల, లోయపల్లి, జాజిరెడ్డిగూడెం, తిమ్మాపురం గ్రామాల్లో ఆయన సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ ప్రశ్నిస్తే కేసులు పెడుతున్న రాక్షస పాలనను గద్దె దించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ మాయమాటలతో పేదలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో బహుజనులకు రాజ్యాధికారం వచ్చినప్పుడే పేదలు బాగుపడతారని చెప్పారు. ఇసుక మాఫియాపై ప్రశ్నించిన ప్రజలపై పోలీసులతో కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ప్రవీణ్కుమార్ మండిపడ్డారు