రూ. 9 కోట్లతో అదనపు భవనాలు

ABN , First Publish Date - 2020-12-06T05:15:58+05:30 IST

గుమ్మలక్ష్మీపురం సామాజిక ఆరోగ్య కేంద్రం అదనపు భవన సముదాయాలను రూ. 9 కోట్లతో నిర్మిస్తున్నట్లు ఏపీహెచ్‌ ఐడీసీ డిప్యూటీ ఎగ్జి క్యూటివ్‌ ఇంజినీర్‌ ఎం.ప్రభాకర్‌రావు తెలిపారు

రూ. 9 కోట్లతో అదనపు భవనాలు

గుమ్మలక్ష్మీపురం: గుమ్మలక్ష్మీపురం సామాజిక ఆరోగ్య కేంద్రం అదనపు భవన సముదాయాలను రూ. 9 కోట్లతో నిర్మిస్తున్నట్లు ఏపీహెచ్‌ ఐడీసీ డిప్యూటీ ఎగ్జి క్యూటివ్‌ ఇంజినీర్‌ ఎం.ప్రభాకర్‌రావు తెలిపారు. శనివారం ఆయన గుమ్మలక్ష్మీపురం వచ్చిన సందర్భంగా విలేఖ రులతో మాట్లాడారు. సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 50 పడకల ఆసుపత్రిగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న నే పథ్యంలో అదనపు భవన నిర్మాణాలను చేపడు తున్నా మన్నారు. ప్రభుత్వం పేదలు, గిరిజనుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని, ప్రజలు దీనిని వినియోగించు కోవాలన్నారు. ఈ పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని డీఈఈ తెలిపారు.


Updated Date - 2020-12-06T05:15:58+05:30 IST