కామాక్షితాయి నిత్యాన్నదానానికి రూ. 5 లక్షల విరాళం

ABN , First Publish Date - 2021-10-17T05:09:25+05:30 IST

విజయదశమి సందర్భంగా మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో నిత్యాన్నదాన సదనానికి దాతలు రంగయ్య, మురళి శుక్రవారం 5లక్షలా 116 రూపాయలు విరాళంగా అందజేసినట్లు శనివారం ఆలయ చైర్మన్‌ చీమల రమేష్‌బాబు, సభ్యులు, ఈవో ఏవీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు

కామాక్షితాయి నిత్యాన్నదానానికి రూ. 5 లక్షల విరాళం
కామాక్షితాయిని దర్శించుకుంటున్న దాతలు

బుచ్చిరెడ్డిపాళెం, అక్టోబరు16:  విజయదశమి సందర్భంగా మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో నిత్యాన్నదాన సదనానికి దాతలు రంగయ్య, మురళి  శుక్రవారం 5లక్షలా 116 రూపాయలు విరాళంగా అందజేసినట్లు శనివారం ఆలయ చైర్మన్‌ చీమల రమేష్‌బాబు, సభ్యులు, ఈవో ఏవీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఏళ్ల తరబడి స్వామి, అమ్మవార్ల సేవలో తరిస్తున్న  చేజర్ల మండలం పెళ్లేరు గ్రామానికి చెందిన నలుబోలు పెంచలయ్య, కాంతమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు 5లక్షలా 116రూపాయలను ఆలయ కార్యాలయంలో చైర్మన్‌, ఈవోలకు అందజేసి రసీదు పొందారు. ఈసందర్భంగా వారి గోత్రనామాలతో ఆలయంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి వారిని శాలువాతో సత్కరించి వారికి తీర్త ప్రసాదాలను అందజేశారు.

Updated Date - 2021-10-17T05:09:25+05:30 IST