రూ.4 లక్షలు చెల్లించి రాష్ట్రానికి Srilanka శరణార్థులు
ABN , First Publish Date - 2022-07-12T15:08:13+05:30 IST
శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా పలువురు సముద్రమార్గంలో అక్రమంగా రాష్ట్రానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే సుమారు 60 మందికి పైగా
పెరంబూర్(చెన్నై), జూలై 11: శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా పలువురు సముద్రమార్గంలో అక్రమంగా రాష్ట్రానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే సుమారు 60 మందికి పైగా శ్రీలంక శరణార్ధులు రాష్ట్రానికి చేరుకున్నారు. వారిని ప్రత్యేక కేంద్రాల్లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 8 గంటలకు శ్రీలంక తలైమన్నార్ నుంచి వవునియా పరైయాన్కుళంకు చెందిన బాలసుగంధన్, ఆయన భార్య అనూజ, వారి ఇద్దరు పిల్లలు, ఉవునియా నెలుంకుళంకు చెందిన లింగేశ్వరన్, ఆయన భార్య ప్రదాంబికై మొత్తం ఆరుగురు రూ.4 లక్షలు అందజేసి ఓ పడవలో మిట్టంపడి తీరానికి చేరకున్నారు. నావికాదళ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. అనంతరం శరణార్ధుల శిబిరానికి తరలించారు.