ఒక్కరోజులో... రూ. 4.60 లక్షల కోట్లు... హుష్కాకి...
ABN , First Publish Date - 2020-09-22T01:51:11+05:30 IST
స్టాక్ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. సెన్సెక్స్ 811.68 పాయింట్లు(2.09 శాతం), నిఫ్టీ 282.75 పాయింట్లు(2.46 శాతం) నష్టపోయి 11,222.20 పాయింట్ల వద్ద ముగిసాయి.
ముంబై : స్టాక్ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. సెన్సెక్స్ 811.68 పాయింట్లు(2.09 శాతం), నిఫ్టీ 282.75 పాయింట్లు(2.46 శాతం) నష్టపోయి 11,222.20 పాయింట్ల వద్ద ముగిసాయి.
ఈ క్రమంలో... ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండడం, కరోనా కేసులు పెరుగుతుండటం, మిడ్, స్మాల్ క్యాప్స్ కరెక్షన్ తదితర కారణాలతో మార్కెట్లు నష్టపోయాయి.
వ్యవసాయ బిల్లుపై రాజ్యసభలో కేంద్రప్రభుత్వానికి సవాళ్లు ఎదురు కావడం, చైనాతో సరిహద్దు వివాదాలు వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసినట్లు చెబుతున్నారు. కుప్పకూలిన మార్కెట్... రూ. 4.58 లక్షల కోట్ల సంపద ఫట్... మార్కెట్లు కుప్పకూలడంతో సోమవారం ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు.
రూ. 4.58 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. దీంతో బిఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 54.42 కోట్లకు క్షీణించింది. మార్కెట్లో ఆందోళనల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది. మధ్యాహ్నం వరకు మార్కెట్లుఊగిసలాటలోనే ఉన్నాయి. చివరికు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.