బహిరంగ ధూమపానంపై రూ.33 కోట్ల జరిమానా
ABN , First Publish Date - 2022-10-03T15:44:32+05:30 IST
కేంద్ర ప్రభుత్వం 2008 అక్టోబర్ 2న తీసుకొచ్చిన బహిరంగ ధూమపాన నిషేధ చట్టం కింద గడిచిన 14 ఏళ్లలో రూ.33 కోట్ల జరిమానా
హైదరాబాద్ సిటీ: కేంద్ర ప్రభుత్వం 2008 అక్టోబర్ 2న తీసుకొచ్చిన బహిరంగ ధూమపాన నిషేధ చట్టం కింద గడిచిన 14 ఏళ్లలో రూ.33 కోట్ల జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. పొగ తాగే వారితో పాటు పొగ పీల్చిన వారు కూడా అనారోగ్యం బారినపడుతున్న తరుణంలో.. కేంద్ర ప్రభుత్వం హోటళ్లు, రెస్టారెంట్లు, విమానాశ్రయాలతో పాటు బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ధూమపాన నిషేధ ఆదేశాలు అమలులోకి వచ్చిన తర్వాత 2008 నుంచి 2020 జూన్ వరకు 26,16,050 మందికి జరిమానా విధించారు.