రూ.30 లక్షల నకిలీ నోట్ల స్వాధీనం
ABN , First Publish Date - 2022-04-28T14:02:32+05:30 IST
స్థానిక మనలి పుదునగర్లో రూ.30 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ ప్రాం తంలోని ఓ ఇంట్లో కొందరు ఘర్షణ
- ఆరుగురి అరెస్టు
పెరంబూర్(చెన్నై): స్థానిక మనలి పుదునగర్లో రూ.30 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ ప్రాంతంలోని ఓ ఇంట్లో కొందరు ఘర్షణ పడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో, అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని చుట్టుముట్టి పరిశీలించగా నకిలీ నోట్లు తయారుచేసే ముఠా అని తెలిసింది. ఆ ప్రాంతంలో ఆటో సీటు కింద రూ.30 లక్షల విలువైన రూ.500 నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో వాషర్మెన్పేటకు చెందిన యువరాజ్, మన్నివాక్కంకు చెందిన ప్రభాకరన్, పాత వాషర్మెన్పేటకు చెందిన ఇంతియాజ్, తిరువొత్తియూర్ తాంగళ్కు చెందిన జాన్జోసఫ్, వ్యాసర్పాడికి చెందిన రాహుల్ఖాన్, రెడ్హిల్స్కు చెందిన ముబారక్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచి మేజిస్ట్రేట్ ఉత్తర్వుల మేరకు పుళల్ జైలుకు తరలించారు.