రూ. 30 లక్షల విలువైన గుట్కా స్వాధీనం

ABN , First Publish Date - 2020-07-06T09:56:04+05:30 IST

గుట్కా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శంషాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు

రూ. 30 లక్షల విలువైన గుట్కా స్వాధీనం

రాజేంద్రనగర్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): గుట్కా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శంషాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. డీసీఎంలో గుట్కా రవాణా చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. హిమాయత్‌సాగర్‌ సమీపంలో ఔటర్‌ రింగ్‌రోడ్డు వద్ద డీసీఎంను పట్టుకున్నారు. వందల బ్యాగుల్లోగల రూ. 30 లక్షల విలువైన గుట్కాను, డీసీఎంను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా తరలిస్తున్న రాజేంద్రనగర్‌ నౌ నంబర్‌ ప్రాంతానికి చెందిన షేక్‌ ఇమ్రాన్‌(29), డ్రైవర్‌ షేక్‌ గబ్బర్‌(50)ను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం వారిని రాజేంద్రనగర్‌ పోలీసులకు అప్పగించారు. 

Updated Date - 2020-07-06T09:56:04+05:30 IST