ఎస్వీబీసీకి రూ.30 లక్షల విరాళం
ABN , First Publish Date - 2021-01-15T05:30:00+05:30 IST
టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర భక్తిఛానల్ (ఎస్వీబీసీ)కి శుక్రవారం రూ.30 లక్షలు విరాళంగా అందాయి.
తిరుమల, జనవరి15 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర భక్తిఛానల్ (ఎస్వీబీసీ)కి శుక్రవారం రూ.30 లక్షలు విరాళంగా అందాయి. భువనేశ్వర్కు చెందిన శివం కాందెవ్ ప్రైవేట్ లిమిటెడ్, జంషడ్పూర్కు చెందినలాల్ ఇంజినీరింగ్ లిమిటెడ్, న్యూఢిల్లీకి చెందిన రామ సివిల్ ఇండియా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్.. రూ.10 లక్షల చొప్పున రూ.30 లక్షలు ఎస్వీబీసీ ట్రస్ట్కు అందజేశారు. ఈ మూడు కంపెనీల తరుపున తిరుపతికి చెందిన రాఘవేంద్ర విరాళాల డీడీలను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి అందించారు. కాగా, మరో కంపెనీ తరపున కూడా ఇదే ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందినట్టు సమాచారం. దీనిని టీటీడీ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.