రూ.3 కోట్లు నగదు స్వాధీనం
ABN , First Publish Date - 2022-05-17T06:39:17+05:30 IST
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ప్లాజా వద్ద సోమవారం ఓ కారులో రూ.3 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. అనకాపల్లి నుంచి రాజమండ్రి వైపు వెళుతున్న కారును టోల్ప్లాజా వద్ద ఎస్ఐ డి.వెంకన్న నేతృత్వంలో సిబ్బంది తనిఖీ చేయగా...రూ.3 కోట్లు కనిపించడంతో ఆరా తీశారు.
కారులో తరలిస్తుండగా వేంపాడు టోల్ప్లాజా వద్ద గుర్తింపు
ఆధారాలు చూపకపోవడంతో విచారణ
నక్కపల్లి, మే 16: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ప్లాజా వద్ద సోమవారం ఓ కారులో రూ.3 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. అనకాపల్లి నుంచి రాజమండ్రి వైపు వెళుతున్న కారును టోల్ప్లాజా వద్ద ఎస్ఐ డి.వెంకన్న నేతృత్వంలో సిబ్బంది తనిఖీ చేయగా...రూ.3 కోట్లు కనిపించడంతో ఆరా తీశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన బొమ్మకంటి శ్రీనివాసరావుకు అనకాపల్లిలో వేమరాజు అనే వ్యక్తి ఈ నగదు ఇచ్చినట్టు కారులో వున్న వ్యక్తులు చెప్పారు. అయితే అందుకు సంబంధించి సరైన పత్రాలు, ఆధారాలు చూపకపోవడంతో కారుతో పాటు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది లీగలా? కాదా? అనే విషయమై విచారణలో తేలుతుందని సీఐ నారాయణరావు తెలిపారు.