వలంటీర్ల సత్కారానికి రూ.261 కోట్లా !
ABN , First Publish Date - 2021-04-13T05:28:53+05:30 IST
వలంటీర్లకు రూ.261 కోట్లు ఖర్చు పెట్టి సత్కారం చేయడం ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి విమర్శించారు. సోమవారం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో రెడ్యం విలేకరులతో మాట్లాడారు.
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం
కడప, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): వలంటీర్లకు రూ.261 కోట్లు ఖర్చు పెట్టి సత్కారం చేయడం ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి విమర్శించారు. సోమవారం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో రెడ్యం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు సరిగా జీతాలు ఇచ్చేందుకు దిక్కులేదు కానీ వలంటీర్ల సత్కారానికి ఇలా డబ్బులు ఖర్చు చేయడం చూస్తుంటే ‘ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కినట్లు’గా ఉందని ఎద్దేవా చేశారు. సమావేశంలో టీడీపీ నగర కమిటీ అధ్యక్షుడు షేక్ జిలానీబాషా, జిల్లా అధికార ప్రతినిధి ఆమూరి బాలదాసు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొమ్మలపాటి సుబ్బరాయుడు, శివ, బీసీ సెల్ జిల్లా నాయకులు శ్రీనివాసులు, పందిళ్లపల్లె మాజీ సర్పంచ్ సగబాల మునిస్వామి, చిట్వేలు అనిల్బాబు పాల్గొన్నారు.