రూ.25 లక్షలు స్వాధీనం

ABN , First Publish Date - 2021-01-27T05:53:00+05:30 IST

నగరంలోని ద్వారకా నగర్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ కూడలి వద్ద సీఐ గొలగాని అప్పారావు, సిబ్బంది మంగళవారం సాయంత్రం ఇద్దరిని అదుపులోకి తీసుకుని, రూ.25 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

రూ.25 లక్షలు స్వాధీనం

పోలీసుల అదుపులో ఇద్దరు కేరళ వాసులు


సీతంపేట (విశాఖపట్నం), జనవరి 26: నగరంలోని ద్వారకా నగర్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ కూడలి వద్ద సీఐ గొలగాని అప్పారావు, సిబ్బంది మంగళవారం సాయంత్రం ఇద్దరిని అదుపులోకి తీసుకుని, రూ.25 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు...ఆ సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరిని ఆపారు. వారిద్దరూ కంగారు పడుతుండడంతో ప్రశ్నించి వారి వద్ద బ్యాగ్‌ను తనిఖీ చేశారు. అందులో రూ.25 లక్షల నగదు ఉంది. ఆ నగదుకు సంబంధించి వివరాలు అడగ్గా సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకుని, ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిని సీఐ విచారించగా...తాము ఉద్యోగ రీత్యా కేరళ నుంచి విశాఖ వచ్చామని, తమ పేర్లు ఈకే రిష్వాన్‌, మోసూరి శివతేజగా పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తి ఆ నగదును ముంబై తీసుకువెళ్లి అప్పగించాలని కోరినట్టు వెల్లడించారు. ఎస్‌ఐ స్వామినాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-01-27T05:53:00+05:30 IST