రామాలయ నిర్మాణానికి రూ.2.16 లక్షలు విరాళం
ABN , First Publish Date - 2021-01-16T05:07:39+05:30 IST
ప్రముఖ సంఘ సేవకుడు, హిందూపురం పార్లమెంటు మాజీ ఇన్చార్జ్ లయన్ పఠాన్ ఖాసింఖాన్ అనంతపురం జిల్లా నల్లమాడ మండలం బడవాండ్లపల్లె గ్రామంలో రామాలయ నిర్మాణానికి రూ.2.16 లక్షలు విరాళాన్ని అందించారు.
కడప(ఎర్రముక్కపల్లె), జనవరి 15: ప్రముఖ సంఘ సేవకుడు, హిందూపురం పార్లమెంటు మాజీ ఇన్చార్జ్ లయన్ పఠాన్ ఖాసింఖాన్ అనంతపురం జిల్లా నల్లమాడ మండలం బడవాండ్లపల్లె గ్రామంలో రామాలయ నిర్మాణానికి రూ.2.16 లక్షలు విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడవాండ్లపల్లెలో తమ పూర్వీకుల సమాధులున్నాయని వాటిని దర్శించుకోవడానికి వచ్చేటప్పుడు స్థానిక ప్రజలు తమ గ్రామంలో రామమందిరం ఏర్పాటు చేయాలని కోరగా, తక్షణం స్పందించి ఈ విరాళం అందజేశామన్నారు. కార్యక్రమంలో ఖాసింఖాన్ సోదరులు అక్బర్ఖాన్, బాబాఖాన్, రహింఖాన్, హైదర్వల్లి ఖాన్, రఫిక్ఖాన్, అలీ తదితరులు పాల్గొన్నారు.