రామాలయ నిర్మాణానికి రూ.2.16 లక్షలు విరాళం

ABN , First Publish Date - 2021-01-16T05:07:39+05:30 IST

ప్రముఖ సంఘ సేవకుడు, హిందూపురం పార్లమెంటు మాజీ ఇన్‌చార్జ్‌ లయన్‌ పఠాన్‌ ఖాసింఖాన్‌ అనంతపురం జిల్లా నల్లమాడ మండలం బడవాండ్లపల్లె గ్రామంలో రామాలయ నిర్మాణానికి రూ.2.16 లక్షలు విరాళాన్ని అందించారు.

రామాలయ నిర్మాణానికి రూ.2.16 లక్షలు విరాళం
గ్రామస్తులకు చెక్కునందిస్తున్న ఖాసింఖాన్‌, అక్బర్‌ఖాన్‌

కడప(ఎర్రముక్కపల్లె), జనవరి 15: ప్రముఖ సంఘ సేవకుడు, హిందూపురం పార్లమెంటు మాజీ ఇన్‌చార్జ్‌ లయన్‌ పఠాన్‌ ఖాసింఖాన్‌ అనంతపురం జిల్లా నల్లమాడ మండలం బడవాండ్లపల్లె గ్రామంలో రామాలయ నిర్మాణానికి రూ.2.16 లక్షలు విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడవాండ్లపల్లెలో తమ పూర్వీకుల సమాధులున్నాయని వాటిని దర్శించుకోవడానికి వచ్చేటప్పుడు స్థానిక ప్రజలు తమ గ్రామంలో రామమందిరం ఏర్పాటు చేయాలని కోరగా, తక్షణం స్పందించి ఈ విరాళం అందజేశామన్నారు. కార్యక్రమంలో ఖాసింఖాన్‌ సోదరులు అక్బర్‌ఖాన్‌, బాబాఖాన్‌, రహింఖాన్‌, హైదర్‌వల్లి ఖాన్‌, రఫిక్‌ఖాన్‌, అలీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T05:07:39+05:30 IST