కాంగ్రెస్ సభ్యత్వంతో రూ.2లక్షల బీమా
ABN , First Publish Date - 2022-01-22T04:05:30+05:30 IST
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వంతో ప్రతీ కార్యకర్తకు ఉచితంగా రూ.2లక్షల బీమాను పార్టీ కల్పిస్తోందని ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ జావీద్ పేర్కొన్నారు.
ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు జావీద్
ఖమ్మంసంక్షేమవిభాగం, జనవరి 21: కాంగ్రెస్ పార్టీ సభ్యత్వంతో ప్రతీ కార్యకర్తకు ఉచితంగా రూ.2లక్షల బీమాను పార్టీ కల్పిస్తోందని ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ జావీద్ పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మంనగరంలోని 2, 3వ డివిజన్లలో ఆన్లైన్ నమోదును ఆయన పరిశీలించారు. సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే ఖమ్మం ముందు వరసలో ఉందన్నారు. ప్రజలు మార్పు వైపు ఆలోచిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ మలీదు హైమావతి, నాయకులు చిన్న నాగేశ్వరరావు, నర్సింహారావు, గోపి తదితరలు పాల్గొన్నారు.