దళిత బంధుకు రూ.17,700 కోట్లు
ABN , First Publish Date - 2022-05-15T08:44:36+05:30 IST
దళిత బంధు పథకం అమలుకుగాను రూ.17,700 కోట్లకు సంబంధించి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో)ను ప్రభుత్వం విడుదల చేసింది.
బీఆర్వో జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, మే 14 (ఆంధ్రజ్యోతి): దళిత బంధు పథకం అమలుకుగాను రూ.17,700 కోట్లకు సంబంధించి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో)ను ప్రభుత్వం విడుదల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి దళిత బంధుకు ప్రభుత్వం బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించింది. ఇప్పుడు ఈ మొత్తానికి సంబంధించిన బీఆర్వో జారీ అయింది. ఎస్సీ సంక్షేమ శాఖకు నిధుల మంజూరుకు త్వరలోనే పరిపాలనాపరమైన అనుమతులు వెలువడనున్నాయి. బడ్జెట్లో కేటాయించిన మొత్తానికి ఒకేసారి బీఆర్వోరావడం ఇదే మొదటిసారి అని ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు.