మురుగు కాల్వ పూడ్చిన వ్యక్తికి రూ. 10 వేల జరిమానా
ABN , First Publish Date - 2021-04-13T05:27:05+05:30 IST
మునిసిపల్ పరిధిలోని విద్యానగర్ కాలనీకి చెం దిన మోనోజీ అనే వ్యక్తి తన ఇంటి నిర్మా ణంలో భాగంగా పనులు చేస్తూ ఇంటి ముందు ఉన్న మురుగు కాల్వను పూర్తి గా మట్టితో పూడ్చాడు.
కల్వకుర్తి టౌన్, ఏప్రిల్ 12: మునిసిపల్ పరిధిలోని విద్యానగర్ కాలనీకి చెం దిన మోనోజీ అనే వ్యక్తి తన ఇంటి నిర్మా ణంలో భాగంగా పనులు చేస్తూ ఇంటి ముందు ఉన్న మురుగు కాల్వను పూర్తి గా మట్టితో పూడ్చాడు. ఈ విషయం తెలుసుకున్న ఏఈ శివ సంఘటన స్థలా న్ని పరిశీలించారు. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మురుగు కాల్వలో మట్టి పోసి ట్రాక్టర్లు వచ్చి పోయేందుకు ఏర్పాటు చేసుకున్నట్లు ఏఈ గుర్తించాడు. సదరు వ్యక్తి వ్యవహా రంతో ట్రాక్టర్ వచ్చి పోవడంతో మురుగు కాల్వ ధ్వంసమైన నేపథ్యంలో వెంట నే రూ. 10 వేల జరిమానా విధించినట్లు శివ పేర్కొన్నారు. నిర్మాణ పనులు చేపట్టే ముందు మునిసిపల్ కార్యాలయం అను మతులు ముందస్తుగా తీసుకోవాలని, ని బంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరిస్తూ జరిమా నా విధించనున్నట్లు శివ తెలిపారు.