షిప్యార్డులో మృతుల కుటుంబాలకు రూ.కోటి చెల్లించాలి
ABN , First Publish Date - 2020-08-03T09:43:52+05:30 IST
హిందుస్థాన్ షిప్యార్డులో శనివారం జరిగిన క్రేన్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్సీ బుద్ద ..
ఎమ్మెల్సీ బుద్ద, మాజీ ఎమ్మెల్యే పీలా డిమాండ్
అనకాపల్లి, ఆగస్టు 2 : హిందుస్థాన్ షిప్యార్డులో శనివారం జరిగిన క్రేన్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఉద్యోగాలు ఇవ్వాలని, క్షతగాత్రులకు రూ.25 లక్షలు చెల్లించి మెరుగైన వైద్యం అందించాలని పేర్కొన్నారు. ప్రమాదానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.