ఉగ్రదాడిలో ఆర్‌పీఎఫ్ జవాను కన్నుమూత

ABN , First Publish Date - 2022-04-19T02:50:00+05:30 IST

పుల్వామా : దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఆర్‌పీఎఫ్(రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్)కు చెందిన ఓ జవానును కాల్చిచంపారు.

ఉగ్రదాడిలో ఆర్‌పీఎఫ్ జవాను కన్నుమూత

పుల్వామా : దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఆర్‌పీఎఫ్(రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్)కు చెందిన ఓ జవానును కాల్చిచంపారు. అతిసమీపం నుంచి ఈ దాడి చేశారు. సోమవారం జరిగిన ఈ ఘటనలో మరో జవాను గాయాలపాలయ్యాడని కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. పుల్వామాలోని కాకపోరా వద్ద ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని వెల్లడించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఒక ఆర్‌పీఎఫ్ జవాను కన్నుమూశాడని వెల్లడించారు. ఓ దుకాణం వద్ద ఉన్న జవాన్లపై అతి సమీపం నుంచి ఈ దాడిచేశారని, విధుల్లో లేని జవాన్లే లక్ష్యంగా దాడి చేశారని వివరించారు.

Updated Date - 2022-04-19T02:50:00+05:30 IST