ఆర్పీఎఫ్‌ బైక్‌ ర్యాలీ

ABN , First Publish Date - 2022-07-02T06:15:44+05:30 IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఆధ్వర్యంలో ఆర్పీఎఫ్‌(రైల్వే ప్రోటక్షన్‌ ఫోర్స్‌) సిబ్బంది శుక్రవారం నగరంలో బైక్‌ ర్యాలీని నిర్వహించారు.

ఆర్పీఎఫ్‌ బైక్‌ ర్యాలీ
జెండా ఊపీ ర్యాలీని ప్రారంభిస్తున్న ఆర్పీఎఫ్‌ అధికారులు

ఆర్పీఎఫ్‌ బైక్‌ ర్యాలీ

పాయకాపురం, జూలై 1 : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా సౌత్‌  సెంట్రల్‌ రైల్వే ఆధ్వర్యంలో ఆర్పీఎఫ్‌(రైల్వే ప్రోటక్షన్‌ ఫోర్స్‌) సిబ్బంది శుక్రవారం నగరంలో బైక్‌ ర్యాలీని నిర్వహించారు. లక్ష్యం, శాంతి, జాతీయ సమైక్యత, సామరస్య సందేశాన్ని ప్రచారం  చేస్తూ రైల్వే స్టేషన్‌ నుంచి ముస్తాబాద్‌, గుడ్లవల్లేరు, గుడివాడ తదితర ప్రాంతాల్లో 120 కి.మీ. ఈ యాత్ర సాగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి సీనియర్‌ డివిజనల్‌ సెక్యూరిటీ కమిషనర్‌ వల్లేశ్వర బీ తొకల మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర సందేశాన్ని వ్యాప్తి చేయడానికి విజయవాడ ఆర్పీఎఫ్‌ సిబ్బంది రన్‌ ఫర్‌ యూనిటీ, జల్‌సేవ, ప్లాంటేషన్‌ డ్రైవ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. 

Updated Date - 2022-07-02T06:15:44+05:30 IST