IPL 2022: కీలక మ్యాచ్లో పంజాబ్పై టాస్ గెలిచిన బెంగళూరు
ABN , First Publish Date - 2022-05-14T00:47:36+05:30 IST
ఐపీఎల్లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. పంజాబ్ కింగ్స్తో జరగనున్న మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్
ముంబై: ఐపీఎల్లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. పంజాబ్ కింగ్స్తో జరగనున్న మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఆర్సీబీ ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత సులభం చేసుకోవాలని భావిస్తోంది.
మరోవైపు, పంజాబ్ కింగ్స్ కింద నుంచి మూడో స్థానంలో ఉంది. ఈ జట్టుకు కూడా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇంకా తెరిచే ఉన్నాయి. అయితే, వరుసగా అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది. కాబట్టి నేటి మ్యాచ్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. ఇక, ఇప్పటి వరకు ఆర్సీబీ-పంజాబ్ కింగ్స్ నేరుగా తలపడిన మ్యాచుల్లో బెంగళూరు 13సార్లు, పంజాబ్ 16 సార్లు విజయం సాధించాయి.
2020 నుంచి ఇరు జట్లు ఐదుసార్లు తలపడగా నాలుగుసార్లు పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్లోనూ బెంగళూరుపై పైచేయి సాధించి ఆ రికార్డును నిలుపుకుంటుందో, లేదో చూడాలి. బెంగళూరు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, పంజాబ్ జట్టులో మాత్రం ఒక మార్పు చోటుచేసుకుంది. సందీప్ శర్మ స్థానంలో హర్ప్రీత్ బ్రార్ జట్టులోకి వచ్చాడు.