ఎన్‌ఎన్‌.పట్నం చెరువు గొడవపై ఎంపీడీవోకు కలెక్టర్‌ నోటీసులు

ABN , First Publish Date - 2022-05-25T05:55:01+05:30 IST

రౌతులపూడి, మే 24: మండంలోని ఎన్‌ఎన్‌.పట్నం గ్రామం సీతయ్యమ్మ చెరువులో ఎటువంటి అనుమతి లేకుండా ఓ వైసీపీ నేత చేపల పెంపకానికి లీజుకు ఇచ్చాడు. చేపలు పట్టుకునేందుకు చెరువులో నీరు తీసివేస్తుడంగా రైతులు అడ్డుకున్నారు. ఈ సంఘటనపై ఆంధ్రజ్యోతి ప్రచురించిన క

ఎన్‌ఎన్‌.పట్నం చెరువు గొడవపై ఎంపీడీవోకు కలెక్టర్‌ నోటీసులు

రౌతులపూడి, మే 24: మండంలోని ఎన్‌ఎన్‌.పట్నం గ్రామం  సీతయ్యమ్మ చెరువులో ఎటువంటి అనుమతి లేకుండా ఓ వైసీపీ నేత చేపల పెంపకానికి లీజుకు ఇచ్చాడు. చేపలు పట్టుకునేందుకు చెరువులో నీరు తీసివేస్తుడంగా రైతులు అడ్డుకున్నారు. ఈ సంఘటనపై ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనానికి కలెక్టర్‌ కృతికా శుక్లా స్పందించి ఎంపీడీవో గోవిందుకు నోటీసులు జారీ చేశారు. రైతులు వద్దన్నా చెరువులో నీరు ఎందుకు తీశా రనే దానిపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2022-05-25T05:55:01+05:30 IST