పాఠశాల భవనంలో సచివాలయం
ABN , First Publish Date - 2021-09-19T05:01:26+05:30 IST
రౌతులపూడి, సెప్టెంబరు 18: ప్రభుత్వ పాఠశాల ఆవరణ, భవనాల్లో సచివాలయాలు నిర్వహించకూడదు అన్న నిబంధన మండలంలోని మూలగపూడి గ్రామంలో అమలు కావడంలేదు. పాఠశాల భవనాల్లో నిర్వహించే సచివాలయాలను ఖాళీ చేయించి భవనాలు స్వాధీనం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారులకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ చినవీరభద్రుడు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టులో సీసీనం
మూలగపూడిలో అమలుకాని నిబంధన
రౌతులపూడి, సెప్టెంబరు 18: ప్రభుత్వ పాఠశాల ఆవరణ, భవనాల్లో సచివాలయాలు నిర్వహించకూడదు అన్న నిబంధన మండలంలోని మూలగపూడి గ్రామంలో అమలు కావడంలేదు. పాఠశాల భవనాల్లో నిర్వహించే సచివాలయాలను ఖాళీ చేయించి భవనాలు స్వాధీనం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారులకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ చినవీరభద్రుడు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టులో సీసీనంబరు 1209- 2021 ఉత్తర్వుల ప్రకారం పాఠశాల ఆవరణలో గ్రామ సచివాలయాలు ఉండరాదన్న ఆదేశాలు అమలు కావడం లేదు. ఇప్పటికీ గ్రామంలోని పాఠశాల ఆవరణలో గల భవనంలోనే సచివాలయం ఉంది. గ్రామం పెద్దదికాడం ఎమ్.కొత్తూరు గ్రామానికి ఇదే సచివాలయంలోనే పాలనంతా కావడంతో వివిధ పనులు నిమిత్తం ప్రజలు అక్కడికి వస్తున్నారు. దీంతో అఽధికారులు, ప్రజలు గోలతో విద్యార్థులు పాఠ్యాంశాలపై దృష్టి సారించలేకపోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ తమరాల సత్యనారాయణ సచివాలయానికి బిల్డింగ్ను చూపించగా, వైసీపీ నేతలు మరోక భవనం చూపించడంతో అధికారులు తలలుపట్టుకుంటున్నారు. వారి పంతాలతో ఇంకా సచివాలయం పాఠశాల భవనంలోనే కొనసాగుతుంది. ఇది ఇలా ఉండగా సుమారు రెండేళ్లుగా నూతన సచివాలయ పనులు సాగుతూనే ఉన్నాయి. ఇంకా సంవత్సరం దాకా సాగేలా ఉన్నాయి.