ఎస్సార్నగర్లో రౌడీషీటర్ వీరంగం
ABN , First Publish Date - 2020-10-31T08:00:32+05:30 IST
మద్యం మత్తులో ఓ రౌడీషీటర్ వీరంగం సృష్టించాడు. ఈ ఘటన ఎస్సార్నగర్ పోలీ్సస్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
అమీర్పేట, అక్టోబర్ 30 (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో ఓ రౌడీషీటర్ వీరంగం సృష్టించాడు. ఈ ఘటన ఎస్సార్నగర్ పోలీ్సస్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. బుద్ధనగర్కు చెందిన గణే్షపై ఎస్సార్నగర్ ఠాణాలో కేసు నమోదైంది. గతంలో ఇతడిని పీడీ యాక్ట్ కింద కేసు పెట్టి జైలుకు పంపారు. జైలు నుంచి బయటకొచ్చిన గణేష్ తన ప్రవర్తనను మార్చుకోలేదు. గురువారం రాత్రి మద్యం మత్తులో స్థానికులను దుర్భాషలాడుతూ, వారిపై దాడికి యత్నించాడు. దీంతో స్థానికులు కూడా గణే్షపై దాడి చేశారు. గాయాలపాలైన గణే్షను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన విషయమై గణే్షతోపాటు అతడిపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశామని సీఐ సైదులు తెలిపారు.