రాష్ట్రంలో రౌడీ రాజ్యం
ABN , First Publish Date - 2021-10-22T05:56:02+05:30 IST
రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ అన్నారు.
- టీడీపీ నేత, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్
ఓర్వకల్లు, అక్టోబరు 21: రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ అన్నారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపడుతున్న దీక్షకు సంఘీభావంగా గురువారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం హుశేనాపురం గ్రామంలో జడ్పీ మాజీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్తో పాటు టీడీపీ కర్నూలు లోక్సభ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మహిళా సంఘం నాయకులు పార్వతమ్మ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం చరిత్రలోనే ఇది తొలిసారి అన్నారు. శాంతియుతంగా నిరసనలు తెలిపేవారిని అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గు చేటన్నారు. ఇలాంటి దుర్మార్గమైన పాలనకు చమరగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇకనైనా వైసీపీ ప్రభుత్వం కళ్లు తెరిచి ఇలాంటి అరాచకాలకు పాల్పడకుండా ఉండాలని హితవు పలికారు. దీక్షకు సోమాయాజులపల్లె, కాల్వ, శకునాల, వెంకటాపురం, కొమరోలు తదితర గ్రామాల నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. కార్యక్రమంలో టీడీపీ నంద్యాల లోక్సభ ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి, మండల కన్వీనర్ గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు తదితర చోట్ల చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు దీక్షలు చేశారు.