రాష్ట్రంలో రౌడీ రాజ్యం

ABN , First Publish Date - 2021-10-20T05:23:51+05:30 IST

వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో రౌడీ రాజ్యం
నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు

వైసీపీ చర్యలపై టీడీపీ నేతల ఫైర్‌

హిందూపురం, అక్టోబరు 19: వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యాలయాలపైనే వైసీపీ గూండాలు దాడి చేస్తుంటే ఇక సామాన్యులకు భద్రత ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం, టీడీపీ నేతల ఇళ్లపై దాడులను నిరసిస్తూ హిందూపురంలో  టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లకుంట అంజినప్ప, పార్లమెంట్‌ అధికార ప్రతినిధి జేవీ అనిల్‌కుమార్‌, టీడీపీ పట్టణ అధ్యక్షులు రమే్‌షకుమార్‌, బీసీసెల్‌ అధ్యక్షులు దుర్గానవీన, మైనార్టీ సెల్‌ అధ్యక్షులు హిందయతుల్లా, కౌన్సిలర్‌ సతీష్‌ తదితరులు వైసీపీ తీరుపై నిరసన చేపట్టారు. ఈసందర్భంగా వారు మట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రంలో గంజాయి మాఫియా, స్మగ్టర్ల, మత్తు మఠాలకు నిలయంగా మారుతోందన్నారు. ప్రభుత్వం తప్పిందాలను ప్రతిపక్షం ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై దాడులు ప్రజలపై దాడి జరిగినట్లే అన్నారు. వైపీసీ ప్రభుత్వాన్ని భర్తరఫ్‌ చేయాలని గవర్నర్‌ను కోరారు. వైసీపీ గూండాల దాడులకు భయపడేది లేదని హెచ్చరించారు. 


Updated Date - 2021-10-20T05:23:51+05:30 IST