ఆర్టీసీ బస్సు రూట్లలో మార్పు

ABN , First Publish Date - 2020-11-29T05:43:54+05:30 IST

ప్రయాణికుల సౌకర్యార్థం ఆయా రూట్లలో మార్పులు చేసినట్లు అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ విశ్వనాథ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఆర్టీసీ బస్సు రూట్లలో మార్పు

తిరుపతి (రవాణా), నవంబరు 28: తుఫాన్‌ కారణంగా తిరుపతి-పుంగనూరు, పాకాల, సదుం, సోమల రూట్లలో రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఆయా రూట్లలో మార్పులు చేసినట్లు అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ విశ్వనాథ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి-సదుం మధ్య వయా భాకరాపేట, చిన్నగొట్టిగల్లు, రొంపిచెర్ల క్రాస్‌, పులిచెర్ల, కల్లూరు మీదుగా బస్సులు నడుస్తాయన్నారు. ఉదయం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రతి 30 నిమిషాలకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే తిరుపతి-పాకాల మధ్య ప్రతి 30 నిమిషాలకు ఉదయం 5.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సులు తిరుగుతాయని వివరించారు. 

Updated Date - 2020-11-29T05:43:54+05:30 IST