రేపు మేడ్చెల్లోని వ్యవసాయ క్షేత్రంలో రోశయ్య అంత్యక్రియలు
ABN , First Publish Date - 2021-12-04T15:54:48+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య నేటి ఉదయం పరమపదించిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య నేటి ఉదయం పరమపదించిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు రోశయ్యతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కాగా.. రోశయ్య అంత్యక్రియలు రేపు(ఆదివారం) మధ్యాహ్నం 1 గంటకు రేపు మధ్యాహ్నం మేడ్చెల్లోని వ్యవసాయ క్షేత్రంలో అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. రోశయ్య భౌతిక కాయాన్ని స్టార్ ఆసుపత్రి నుంచి అమీర్పేట్లోని ఆయన నివాసానికి తరలించారు. రేపు ఉదయం 9:30 గంటలకు గాంధీభవన్లో ఆయన పార్థీవదేహాన్ని పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు.