అర్ధ సెంచరీ బాది అవుటైన రోరీ బర్న్స్

ABN , First Publish Date - 2021-09-06T21:50:47+05:30 IST

భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరు

అర్ధ సెంచరీ బాది అవుటైన రోరీ బర్న్స్

లండన్: భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరు 77/0తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య జట్టు సరిగ్గా 100 పరుగుల వద్ద రోరీ బర్స్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగులో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రోరీ బర్న్స్ ఆ తర్వాతి బంతికే అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ హసీబ్ హమీద్ కూడా అర్ధ శతకం సాధించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 103 పరుగులు చేసి విజయానికి 265 పరుగుల దూరంలో ఉంది. 

Updated Date - 2021-09-06T21:50:47+05:30 IST