షోలింగర్‌ ఆలయ రోప్‌కార్‌ ట్రయల్‌ రన్‌

ABN , First Publish Date - 2022-04-15T14:56:37+05:30 IST

ప్రసిద్ధిచెందిన షోలింగర్‌ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రోప్‌కార్‌ ట్రయల్‌ రన్‌ గురువారం జరిగింది. చేనేత శాఖ మంత్రి గాంధీ జెండా ఊపి ట్రయల్‌ రన్‌ ప్రారంభించారు.

షోలింగర్‌ ఆలయ రోప్‌కార్‌ ట్రయల్‌ రన్‌

వేలూరు(చెన్నై): ప్రసిద్ధిచెందిన షోలింగర్‌ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రోప్‌కార్‌ ట్రయల్‌ రన్‌ గురువారం జరిగింది. చేనేత శాఖ మంత్రి గాంధీ జెండా ఊపి ట్రయల్‌ రన్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో అరక్కోణం ఎంపీ జగద్రక్షకన్‌, జిల్లా కలెక్టర్‌ భాస్కర పాండ్యన్‌, విరాళదాతలు భూపాలన్‌, రవి, యూనియన్‌ కమిటీ అధ్యక్షుడు కలైకుమార్‌, ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ జయలు పాల్గొన్నారు. ట్రయల్‌ రన్‌లో రోప్‌కార్‌లో ప్రయాణించిన మంత్రి గాంధీ, ఎంపీ జగద్రక్షకన్‌లు ఆలయానికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్నారు. వారికి ఆలయ జాయింట్‌ కమిషనర్‌ జయ, ఆలయ అర్చకులు స్వాగతం పలికి ప్రసాదాలు అందజేశారు.

Updated Date - 2022-04-15T14:56:37+05:30 IST