రూటు మార్చిన సారాసురులు!

ABN , First Publish Date - 2022-01-26T04:21:02+05:30 IST

రూటు మార్చిన సారాసురులు!

రూటు మార్చిన సారాసురులు!
పోలీసులు స్వాధీనం చేసుకున్న సారా ప్యాకెట్లు

సముద్ర మార్గంలో సరుకు రవాణా

కొత్తపాలెం తీరంలో పట్టుబడిన 6000 ప్యాకెట్లు

కవిటి, జనవరి 25 : సారా వ్యాపారులు రూటు మార్చారు. రోడ్డు రవాణాపై అధికారుల నిఘా పెరగడంతో సముద్ర మార్గాన్ని ఎంచుకున్నారు. ఒడిశా నుంచి బోట్లు, పడవల్లో ఆంధ్రాకు సారా తరలించి... సొమ్ము చేసుకుంటున్నారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌బ్యూరో, పోలీస్‌ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన దాడుల్లో సోమవారం అర్ధరాత్రి కవిటి మండలం కొత్తపాలెం తీరంలో 600 లీటర్ల (ఆరువేల ప్యాకెట్లు)నాటు సారా పట్టుబడింది. ఒడిశాలోని నువగాం నుంచి సారా తెస్తుండగా.. ముందస్తు సమాచారం మేరకు దాడిచేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఈబీ ఏఎస్‌పీ శ్రీనివాసరావు, జేడీ గోపాల్‌ మాట్లాడుతూ పట్టుబడిన సారా విలువ రూ.1.20 లక్షలు ఉంటుందని చెప్పారు. తీర ప్రాంతాల్లో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. చేపల వేట మాటున సారా రవాణా సాగుతోందన్నారు. ఈ దాడుల్లో పాల్గొన్న ఎస్‌ఈబీ అధికారులు వెంకాల అప్పలనాయుడు, ఇంటెలిజెన్స్‌ సీఐ మురళి, పలాస డీటీఎఫ్‌ సీఐ సతీష్‌కుమార్‌, శ్రీకాకుళం స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్‌ఐ మోహన్‌, సోంపేట స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్‌ఐ రమణ, కవిటి ఎస్‌ఐ జి.అప్పారావులను అభినందించారు. 

Updated Date - 2022-01-26T04:21:02+05:30 IST