రూ. 81 కోట్లు వదులుకోనున్న రొనాల్డో
ABN , First Publish Date - 2020-03-30T09:57:40+05:30 IST
కరొనా మహమ్మారి ధాటికి యూఈఎ్ఫఏ, కోపా అమెరికా కప్లాంటి ప్రముఖ టోర్నీలన్నీ వాయిదాపడ్డాయి. దాంతో సాకర్కు భారీ నష్టం వాటిల్లనుంది.
రోమ్: కరొనా మహమ్మారి ధాటికి యూఈఎ్ఫఏ, కోపా అమెరికా కప్లాంటి ప్రముఖ టోర్నీలన్నీ వాయిదాపడ్డాయి. దాంతో సాకర్కు భారీ నష్టం వాటిల్లనుంది. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత ఫుట్బాల్ జట్టు యువెంటస్ ఆటగాళ్లు.. తమ నాలుగు నెలల వేతనాన్ని వదులుకొనేందుకు సిద్ధపడ్డారు. ఈ మొత్తం రూ. 700 కోట్లు కావడం గమనార్హం. జట్టులో స్టార్ ఫార్వర్డ్ క్రిస్టియానో రొనాల్డో అత్యధిక మొత్తం పొందుతున్న ఆటగాడు. దాంతో అతడు దాదాపు రూ. 81 కోట్లు కోల్పోనున్నాడు.