రోజా ట్రస్టు సాయం
ABN , First Publish Date - 2021-05-13T06:35:58+05:30 IST
కరోనా బాధితులను ఆదుకునేందుకు ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రస్టు రూ.5 లక్షల వైద్య సామగ్రిని అందజేసింది.
పుత్తూరు టౌన్, మే 12: కరోనా బాధితులను ఆదుకునేందుకు ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రస్టు ముందుకొచ్చింది. బుధవారం ఆమె భర్త ఆర్కే సెల్వమణి రూ.5లక్షల విలువైన యంత్రాలు, ఇతర సామగ్రిని పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి అందజేశారు. వీటిలో శానిటేషన్, సీబీఎస్, ఈసీజీ యంత్రాలు, సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం, పీపీఈ కిట్లు, మాస్కులున్నాయి. ఈ సంద ర్భంగా కొవిడ్ జిల్లా కో-ఆర్డినేటర్ రవిరాజు మాట్లాడుతూ... కరోనా బాధితులను ఆదుకోవడానికి ఎమ్మెల్యే రోజా ముందుకు రావడం అభినందనీయమని కొని యాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ హరి, వైస్ చైర్మన్ డి.ఎస్.శంకర్, కమిషనర్ వెంకట్రామిరెడ్డి, వైద్యాధికారి ప్రభావతి, కౌన్సిలర్లు జయప్రకాష్, నరసింహరావు, పవన్కుమార్, ఏకాంబరం, భానుమతి, ఎస్ఐ రామాంజనేయులు, నాయకులు మహీన్ తదితరులు పాల్గొన్నారు.