మరో వివాదంలో రోజా

ABN , First Publish Date - 2020-07-09T00:19:54+05:30 IST

ఎమ్మెల్యే రోజా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సొంత నియోజకవర్గంలో ఆమె మాస్క్ లేకుండా పర్యటించడం చర్చకు దారితీస్తోంది.

మరో వివాదంలో రోజా

నగరి: ఎమ్మెల్యే రోజా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సొంత నియోజకవర్గంలో ఆమె మాస్క్ లేకుండా పర్యటించడం చర్చకు దారితీస్తోంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి (జూలై 8)ని రైతు దినోత్సవంగా పాటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రైతులకు సంబంధించిన పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా రోజా కూడా నగరిలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఇక్కడే ఆమె వివాదాల్లో చిక్కుకున్నారు. నగరి నియోజకవర్గంలో కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల కరోనాతో మరణాలు కూడా సంభవించాయి. ఇలాంటి పరిస్థితిల్లో రోజా, తన చుట్టూ జనాలు ఉన్నప్పటికీ ఆమె మాస్క్ పెట్టుకోలేదు. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే కరోనా నివారణ కోసం చర్యలు తీసుకోవాలని చెబుతున్నాయి. ఆమె మాత్రం ఆ నియమాలను పాటించడం లేదు. మాస్క్ లేకుండా.. భౌతిక దూరం పాటించకుండా పలు కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో రోజా తీరును పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆమె ఎమ్మెల్యేగా అందరికీ ఆదర్శంగా ఉండాలి.. కానీ ఆమె నియమాలు పాటించపోతే ఎలా స్థానికులు నిలదీస్తున్నారు. 

Updated Date - 2020-07-09T00:19:54+05:30 IST