వరద ప్రాంతాల్లో Chandrababu బురద రాజకీయాలు చేస్తున్నారు: Roja
ABN , First Publish Date - 2022-08-01T14:55:15+05:30 IST
వరద ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) బురద రాజకీయాలు చేస్తున్నారని మంత్రి రోజా(Minister Roja) విమర్శించారు.
Tirumala : వరద ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) బురద రాజకీయాలు చేస్తున్నారని మంత్రి రోజా(Minister Roja) విమర్శించారు. తిరుమలలో స్వామివారి దర్శనానంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పోలవరా(Polavaram)న్ని ఎందుకు పూర్తిచేయలేదని ఆమె ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేస్తామనడం హాస్యాస్పదమన్నారు. సొంత నియోజకవర్గం కుప్పం(Kuppam)ను అభివృద్ధి చేయలేని చంద్రబాబు.. ముంపు మండలాలను జిల్లాగా మారుస్తారట అని ఎద్దేవా చేశారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు 23 సీట్లు కూడా రావని మంత్రి రోజా జోస్యం చెప్పారు.