తన కూతురితో క్యూట్ వీడియోని షేర్ చేసిన రోహిత్ శర్మ

ABN , First Publish Date - 2020-06-07T00:23:13+05:30 IST

టీం ఇండియా ఓపెనర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ లాక్‌డౌన్ సమయంలో సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. తనకు సంబంధించిన విషయాలు

తన కూతురితో క్యూట్ వీడియోని షేర్ చేసిన రోహిత్ శర్మ

టీం ఇండియా ఓపెనర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ లాక్‌డౌన్ సమయంలో సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. తనకు సంబంధించిన విషయాలు పంచుకోవడంతో పాటు తోటి ఆటగాళ్లతో లైవ్ ఛాట్‌లు నిర్వహిస్తున్నాడు. తాజాగా తన కూతురితో కలిసిన ఓ వీడియోని రోహిత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశాడు. ట్రామ్‌పోలైన్‌పై తన కూతురితో ఆడుకుంటున్న వీడియోని షేర్ చేసిన రోహిత్.. ‘‘ఇలాంటి రోజులు మళ్లీ తిరిగి రావు’’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. 


శుక్రవారం తన తోటి క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌తో కలిసి ‘ఓపెన్ నెట్స్ విత్ మయాంక్’ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్.. తన మూడో డబుల్ సెంచరీ సమయంలో తన భార్య రితికా కన్నీరు పెట్టుకోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. 196వ పరుగు కోసం రోహిత్ డైవ్ చేశాడు. అయితే తన చేయి మెలిక పడిందేమో అనే భయంతోనే రితికా అప్పుడు కన్నీరు పెట్టుకుంది అని అతను తెలిపాడు. 



Updated Date - 2020-06-07T00:23:13+05:30 IST