టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై
ABN , First Publish Date - 2020-10-19T00:40:09+05:30 IST
కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్
దుబాయ్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వరుస విజయాలతో ఊపు మీదున్న రోహిత్ సేన ఈ మ్యాచ్లోనూ అదే జోరు కొనసాగించాలని యోచిస్తుండగా, గేల్ జట్టులోకి వచ్చిన తొలి మ్యాచ్లోనే విజయం సాధించిన పంజాబ్ కొండంత ఆత్మవిశ్వాసంతో ఉంది. ముంబై, పంజాబ్ జట్లు రెండూ ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నాయి.