కుటుంబంతో మాల్దీవులకు Rohit Sharma !
ABN , First Publish Date - 2022-05-27T03:38:19+05:30 IST
ఐపీఎల్ 2022 (IPL2022)లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. ఈ సీజన్లో రోహిత్ సేన పేలవ ప్రదర్శనతో వరుస పరాజయాలు ముటగట్టుకుంది.
ముంబై: ఐపీఎల్ 2022 (IPL2022)లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. ఈ సీజన్లో రోహిత్ సేన పేలవ ప్రదర్శనతో వరుస పరాజయాలు ముటగట్టుకుంది. దాంతో ఐపీఎల్ సీజన్ నుంచి నిష్క్రమించింది. ఈ మెగా టోర్నీలో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. 14 ఇన్నింగ్స్లో 19.14 సగటుతో 268 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్లో రోహిత్ శర్మ అత్యధిక స్కోరు 48 పరుగులే. ఈ నేపథ్యంలో ఆ ఫెయిల్యూర్ మూడ్ నుంచి బయటపడేందుకు రోహిత్ తన భార్యతో కలిసి మాల్దీవులకు వెళ్లాడు. ఓ బీచ్ రిసార్ట్లో భార్య రితికతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాదు... మరిన్ని రోజులు ఇలాంటి ఏకాంతం కావాలని క్యాప్షన్ ఇచ్చాడు.
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. రోహిత్ శర్మ ఫ్యామిలీ టూర్పై అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఈ సీజన్లో రోహిత్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఐపీఎల్ 15వ సీజన్లో ముంబై తమ చివరి మ్యాచ్ను ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడింది. ఈ మ్యాచ్లో ముంబై విజయం సాధించినప్పటికీ, రోహిత్ ప్రదర్శన నిరాశపరిచింది. రోహిత్ 13 బంతుల్లో 2 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్ల టీ 20 సిరీస్ కు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. జూన్ చివర్లో ఇంగ్లండ్ తో జరిగే టెస్టు మ్యాచ్ కు రోహిత్ మళ్లీ అందుబాటులోకి రానున్నాడు.