ఆ రోజు రితికా ఎందుకు ఏడ్చిందంటే.. వెల్లడించిన రోహిత్ శర్మ

ABN , First Publish Date - 2020-06-06T22:07:25+05:30 IST

ఒకటి కంటే ఎక్కువ డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ మాత్రమే. 2017లో శ్రీలంకతో జరిగిన వన్డేలో రోహిత్ మూడో డబుల్ సెంచరీని సాధించాడు.

ఆ రోజు రితికా ఎందుకు ఏడ్చిందంటే.. వెల్లడించిన రోహిత్ శర్మ

ఒకటి కంటే ఎక్కువ డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ మాత్రమే. 2017లో శ్రీలంకతో జరిగిన వన్డేలో రోహిత్ మూడో డబుల్ సెంచరీని సాధించాడు. అయితే ఈ డబుల్ సెంచరీ సాధించన రోజే రోహిత్ శర్మ రెండో వివాహ వార్షికోత్సవం కావడం కూడా మరో విశేషం. అయితే రోహిత్ డబుల్ సెంచరీని సమీపిస్తున్న సమయంలో స్టాండ్స్‌లో ఉన్న రితికా కంటతడి పెట్టుకుంది. అయితే మయాంక్ అగర్వాల్‌తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో రోహిత్ ఆ క్షణాలను గుర్తు చేసుకున్నాడు. తన భార్య రితికా ఎందుకు కంటతడి పెట్టుకుందో కూడా అతను వెల్లడించాడు. 


‘‘నేను తనని ఎందుకు ఏడ్చావు అని అడిగాను. 196వ పరుగు కోసం నేను డైవ్ చేయాల్సి వచ్చింది. దీంతో నా చెయ్యి మెలిక పడింది అని తను అనుకోని ఏడ్చనని నాకు చెప్పింది. ఆమె చాలా సున్నితమైన వ్యక్తి. అదే కారణం అనుకుంటా’’ అని రోహిత్ శర్మ తెలిపాడు. 

Updated Date - 2020-06-06T22:07:25+05:30 IST