రోహిత్ ఖాతాలో మరో రికార్డు
ABN , First Publish Date - 2020-10-02T02:16:41+05:30 IST
ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ మరో రికార్డు సొంతం చేసుకుంది. ఐపీఎల్లో 5 వేల పరుగులు సాధించిన మూడో బ్యాట్స్మన్గా
అబుదాబి: ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో 5 వేల పరుగులు సాధించిన మూడో బ్యాట్స్మన్గా రికార్డులకెక్కాడు. తాజాగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో తాను ఎదుర్కొన్న తొలి బంతిని బౌండరీకి తరలించిన 33 ఏళ్ల రోహిత్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. రోహిత్ 187 ఇన్నింగ్స్లలో ఈ ఘనత సాధించాడు. అతడి కంటే ముందు విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా ఉన్నారు. కోహ్లీ 157, రైనా 173 ఇన్నింగ్స్లలో 5 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నారు.