రోహిత్ కెప్టెన్సీ.. ధోనీని పోలి ఉంటుంది: రైనా

ABN , First Publish Date - 2020-05-23T03:29:24+05:30 IST

భారత ఓపెనర్ రోహిత్ శర్మపై స్టార్ క్రికెటర్ సురేష్ రైనా ప్రశంసల వర్షం కురిపించాడు.

రోహిత్ కెప్టెన్సీ.. ధోనీని పోలి ఉంటుంది: రైనా

ముంబై: భారత ఓపెనర్ రోహిత్ శర్మపై స్టార్ క్రికెటర్ సురేష్ రైనా ప్రశంసల వర్షం కురిపించాడు. కెప్టెన్సీ విషయంలో రోహిత్, ధోనికి పోలికలున్నాయని చెప్పాడు. రోహిత్ కెప్టెన్సీ చాలా వరకు ధోనీ సారధ్యాన్ని పోలి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ప్రశాంతంగా ఉండటం, ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపడంలో రోహిత్, ధోనీ దాదాపుగా ఒకేలా కనిపిస్తారు. ‘ప్రశాంతంగా తన పని తను చేసుకుపోవడంలోగానీ, ఆటగాళ్లను మోటివేట్ చేయడంలోగానీ.. అతను బిందాస్ అంతే’ అంటూ రోహిత్‌ను కొనియాడాడు. కాగా, ఇప్పటి వరకు 10 వన్డే, 19 టీ20 మ్యాచుల్లో భారత్‌కు రోహిత్ శర్మ సారధ్య బాధ్యతలు నిర్వహించాడు. వీటిలో 8 వన్డేలు, 15 టీ20 మ్యాచుల్లో జట్టును విజయతీరాలకు చేర్చాడు.

Updated Date - 2020-05-23T03:29:24+05:30 IST